
ముజఫరాబాద్లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు.. అక్కడికక్కడే మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
Pulwama Attack Mastermind Killed
ది డిజిటల్ బ్రీఫ్
ఇస్లామాబాద్, మే 21, 2026:
పుల్వామా దాడుల సూత్రధారిగా గుర్తింపు పొందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పాకిస్థాన్లో హతమైనట్లు సమాచారం. Muzaffarabad లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన మెరుపు దాడిలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం ముజఫరాబాద్లో ఉన్న సమయంలో దుండగులు హంజా బుర్హాన్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
హంజా బుర్హాన్ పేరు గతంలో జరిగిన పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రముఖంగా వినిపించింది. భారత భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా అతడి పేరు ఉన్నట్లు సమాచారం.
దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఏ సంస్థ ఈ దాడిని నిర్వహించింది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్థాన్ భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇటీవల పాకిస్థాన్లో పలువురు ఉగ్రవాద నాయకులపై ఇలాంటి టార్గెట్ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హంజా బుర్హాన్ హత్య కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Also read the బోరు గుంతలో పడిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లిన తాత మృతి
Also read the పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్రెడ్డి
for more info visit PIB, Election commission



