
15 సంవత్సరాల TMC పాలనకు తెరపడింది — బెంగాల్లో BJP ప్రభుత్వం కొలువుదీరింది
సువేందు అధికారి బెంగాల్ సీఎం
ది డిజిటల్ బ్రీఫ్
కోల్కతా మే 9, 2026:
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో BJP ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరింది. సువేందు అధికారి శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా BJP నేతలు కోల్కతాకు తరలివచ్చి సువేందు అధికారికి అభినందనలు తెలిపారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో BJP 205కు పైగా సీట్లు సాధించగా మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC కేవలం 94 సీట్లకు పరిమితమైంది. దీంతో మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో స్వయంగా మమతను ఓడించిన సువేందు అధికారి ఇప్పుడు బెంగాల్ సీఎం పదవి చేపట్టడం రాజకీయంగా చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. 15 సంవత్సరాల TMC పాలన తర్వాత పశ్చిమ బెంగాల్లో BJP ప్రభుత్వం కొలువుదీరింది.
Also read the డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత.. పోలీసులపై కత్తితో వీరంగం సృష్టించిన మందుబాబు
Also read the బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి — అమిత్ షా సమక్షంలో చారిత్రాత్మక నిర్ణయం
for more info visit PIB, Election commission



