నవ నిర్మాణ సభలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, రాజకీయ వైఖరిపై ఘాటు విమర్శలు
Ponnam Prabhakar on Pawan Kalyan
ది డిజిటల్ బ్రీఫ్
న్యూఢిల్లీ, జూన్ 01, 2026:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ సభలపై స్పందించిన ఆయన, పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నవ నిర్మాణ సభలను గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్, తెలంగాణలో సభలు నిర్వహించడం వెనుక ఉద్దేశ్యమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, “పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు.. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకుని ఎగురుతాడు” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
“కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడటా. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే అక్కడ చేయాలి. తెలంగాణకు వచ్చి నవ నిర్మాణ సభలు పెడితే ఇక్కడ ఎవరూ సహించడానికి సిద్ధంగా లేరు” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ కూడా మంత్రి వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోం” అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also read the Iran Tensions 2026: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు?.. 72 గంటల్లో జరిగిన పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్
for more info visit PIB, Election commission



