
TVK అభ్యర్థి వెంకట రమణన్ చేతిలో తమిళిసై ఓటమి.. మూడో స్థానానికి పరిమితం
ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 4, 2026:
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సుందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలయ్యారు. TVK అభ్యర్థి వెంకట రమణన్ చేతిలో తీవ్రంగా ఓడిపోయిన తమిళిసై మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తమిళిసై సుందరరాజన్కు మైలాపూర్లో తీవ్ర నిరాశ ఎదురైంది. విజయ్ స్థాపించిన TVK పార్టీ తొలి ఎన్నికల్లోనే మైలాపూర్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న తమిళిసై, మూడో స్థానానికి పరిమితం కావడం బీజేపీకి తీవ్ర వెనుదెబ్బగా పరిగణిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ ప్రభావం ఎంతటిదో ఈ ఫలితం స్పష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



