

నార్డిక్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని.. నార్వే రాజు, రాణితో భేటీ కానున్న మోదీ
Modi in Norway
ది డిజిటల్ బ్రీఫ్
ఓస్లో, మే 18, 2026:
Narendra Modi నార్వే పర్యటనలో భాగంగా నార్వే రాజధాని Oslo చేరుకున్నారు. విమానాశ్రయంలో నార్వే ప్రధాని Jonas Gahr Store స్వయంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-నార్వే సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరికొత్త స్నేహ బంధానికి ఈ పర్యటన నాంది పలుకుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నార్వే రాజు Harald V, రాణి Queen Sonjaలను కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మే 19న ఓస్లోలో జరగనున్న 3వ భారత్-నార్డిక్ సదస్సులో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో నార్డిక్ దేశాల అధినేతలతో కీలక దౌత్యపరమైన చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, గ్రీన్ టెక్నాలజీ, భద్రత, ఇన్నోవేషన్ వంటి అంశాలపై భారత్-నార్డిక్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
గత 40 ఏళ్లకు పైగా కాలంలో ఓ భారత ప్రధాని నార్వేలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. భారత్-నార్వే దౌత్య సంబంధాల్లో ఇది కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also read the బోరు గుంతలో పడిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లిన తాత మృతి
Also read the పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్రెడ్డి
for more info visit PIB, Election commission



