
ది డిజిటల్ బ్రీఫ్
హైదరాబాద్, మే 2, 2026:
బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారాం తన భార్య రేణుక చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకలకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం కుటుంబాన్ని అన్ని విధాలా సంతోషంగా ఉంచాడు. హైదరాబాద్లోని బాచుపల్లిలో స్థిరపడిన ఈ కుటుంబం బాహ్యంగా సుఖంగా కనిపించినా, లోపల మాత్రం విషాదం పేరుకుపోతోందని ఎవరూ ఊహించలేదు.
భర్తకు తెలియకుండా రేణుక ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. వారిలో రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసి ప్రైవేట్ వీడియోలు కూడా రికార్డు చేసుకుంది. తదనంతరం ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో సీతారాంకు భార్య నిజస్వరూపం తెలిసి వచ్చింది.
19 పేజీల సూసైడ్ లేఖ
తీవ్ర మనోవేదనకు గురైన సీతారాం ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ నోట్ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నాడు. ఆ లేఖలో:
“నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వీడియోలను ఓ లవర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ దారుణాలను నేను ఎలా తట్టుకోగలను? రేణుకకు ఏం కావాలి — ప్రేమనా లేక శృంగారమా?”అని తన ఆవేదన వెళ్ళగక్కాడు.
సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి రేణుక, రమణారెడ్డి, శ్రవణ్ లను అరెస్ట్ చేశారు.
రేణుక నమ్మకద్రోహం కారణంగా నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం అకాల మరణం పాలయ్యాడని, ఇద్దరు అమాయక పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు తీవ్ర వేదన వ్యక్తం చేశారు.



